కవి, రచయిత, రంగస్థల నటుడు. పొలిటికల్ సైన్స్ లో M.A.చేశారు.వీరి కవిత "ఎడారి కోయిల " ఆంధ్ర భూమి మాసపత్రిక లో 2006 లో ప్రచురితమైనది. బాలమిత్ర లో ప్రాయశ్చిత్తం కథ ప్రచురించబడింది.2019 లో ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం లో" స్ఫూర్తి" కథ ప్రచురితమైంది.2020 లో వార్త ఆదివారం అనుబంధం లో "మరుధ్వతి" కథ ప్రచురితమైంది. మల్లెతీగ (1993)మాస పత్రిక లో "సీతాకోక చిలుక" గీతం ప్రచురణ , గీతానికి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు విశ్లేషణ వ్రాసారు.పలువురు విశ్రాంత ఉద్యోగులకు, అధికారులకు సన్మాన పత్రాలు రచించారు.ఆకాశవాణి భావ వీచికలు కార్యక్రమంలో వీరి కవితలు చదవ బడ్డాయి.2004 సాహితీ భారతి రాష్ట్ర స్థాయి కవితా పోటీలో వీరి కవిత "ఉన్మాదం"కు ప్రోత్సాహక బహుమతి లభించింది.
ఇంత వరకు 5 నాటకాల్లో ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించారు. పలు పత్రికల్లో వీరు వ్రాసిన విశ్లేషణలు ప్రచురింపబడ్డాయి.ఉద్యోగరీత్యా బిజీ వల్ల కొంత కాలం విరామం ఇచ్చి ప్రస్తుతం తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు.